News

ముగిసిన గవర్నర్ ఢిల్లీ పర్యటన


కేంద్ర హోంశాఖ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈ రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఈ రోజు ఉదయం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోయెల్ తోనూ హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ సమావేశమైన గవర్నర్ నరసింహన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాంపింగ్ అంశం, అలాగే పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్యా తాజాగా రేగిన వివాదం గురించి గవర్నర్ వివరించినట్లు తెలిసింది.